సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఐటీ విభాగానికి విధులు నిర్వర్తిస్తున్న ఆమ్రపాలికి భూసమీకరణ పథకం (ల్యాండ్ ఫూలింగ్ స్కీం), లేక్ ప్రొటెక్షన్ కమిటీ, ఎస్టేట్ ఆఫీసర్, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఏళ్ల తరబడి సంస్థలో సెక్రటరీ ఓఎస్డీగా కాంట్రాక్ట్ పద్ధతిన కొనసాగుతున్న రిటైర్డ్ అధికారి రాంకిషన్ను తొలగించారు. అలాగే ఎస్టేట్ ఆఫీసర్ కిషన్రావును బదిలీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ కె. జాన ప్రసూనాంబను హెచ్ఎండీఏ కమిషనర్ ఓఎస్డీగా నియమించారు.