Traffic | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు(Traffic )రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి ప్రాణాలను కాపాడే అంబులెన్స్ కూడా దారి దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బేగంపేట(Begumpet) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో అంబులెన్స్( Ambulance) దాదాపు 25 నిమిషాలు ట్రాఫిక్లో చిక్కుకుంది. రద్దీని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్ లోనే రోగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అంటూ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్
దాదాపు 25 నిమిషాలు ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్
ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అందుబాటులో లేని ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/dutTbQEHe6
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026