– నాంపల్లి తాసీల్దార్ ఆంజనేయులు
నాంపల్లి, సెప్టెంబర్ 15 : తమ ఇండ్లను కూలగొట్టి ఇండ్ల స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా సుంకిశాల గ్రామస్తులు దీక్ష చేస్తున్నారు. మంగళవారం తాసీల్దార్ వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకుని కబ్జాకు గురి అవుతున్న స్థలాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలించి శుక్రవారం లోపు జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ కి నివేదిక అందజేస్తానని, కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా తమ మాటపై నమ్మకం ఉంచి దీక్ష విరమించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాషిపాక రాములు, వార్డు సభ్యులు కలకొండ లక్ష్మయ్య, బుడిగపాక ధనమ్మ, వాడపల్లి లావణ్య, నేరేడుగోమ్ము సత్యనారాయణ, కాటిక ఇదెమ్మ, ఎడమ మల్లేష్, ఆంజనేయులు, దేవేందర్, హరీష్, కిరణ్, రమేష్, ఎర్రయ్య, లింగయ్య పాల్గొన్నారు.