చర్లపల్లి, నవంబర్ 26 : దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. ఏఎస్రావునగర్ డివిజన్, ఈసీఐఎల్ చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదే శానికి రాజ్యాంగం రచించి, దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు అంబేద్కర్ కృషి చేశారన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్య క్ష, కార్యదర్శులు మహిపాల్రెడ్డి, కుమారస్వామి, నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, బేతాల బాల్రాజు, మురళీపంతులు, కాటేపల్లి రవీందర్రెడ్డి, రాంచందర్ గౌడ్, సుదర్శన్రెడ్డి, చంద్రమౌళి, వెంకటేశ్, గిరి, మొగులయ్య, గంటుక శోభారెడ్డితో పాటు ఈసీఐఎల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం బీఎల్ఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నేత బం డారి లక్ష్మారెడ్డి, నాయకులు ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త రామారావు, మహిపాల్రెడ్డి, కుమారస్వామి, రాంచందర్గౌడ్, నేమూరి మహేశ్గౌడ్, శ్రీనివాస్, బైరి నవీన్గౌడ్, కందుల లక్ష్మీ నారాయణ, బేతాల బాల్రాజు, కందాడి సుదర్శన్రెడ్డి, మురళీపంతులు, శోభారెడ్డి, యాకయ్య, అల్లూరయ్య పాల్గొన్నారు.