అల్వాల్, జూన్ 13 : వర్షం బీభత్సానికి చెట్లు కూలడంతో తెగిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కాలనీలో ఓ భారీ చెట్టు కూలిపోయింది.
కారు పక్కనే చెట్టు పడటంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు సందీప్ (45), అతని కూతురు ప్రీతిక (17) బయటకు వచ్చారు. అయితే తెగి పడిన విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు, విద్యుత్ శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వర్షం పడిన వెంటనే లైన్లను పరిశీలించకుండా తెగిపడిన తీగలపై విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాలనీవాసులు మండిపడ్డారు. శిథిలావస్థలో ఉన్న చెట్లను ముందే తొలగించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ దుకోవాలని కోరారు. బాధులైన విద్యు త్ అధికారులను వెంటనే సస్పెం డ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.