మేడ్చల్,జనవరి11:బాసరేగడికి దశాబ్దాల కష్టం తీరింది. ఏండ్ల నుంచి పడుతున్న బాధకు తెరపడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడిలోని ఒక వర్గం శ్మశాన వాటిక స్థలం లేక ఏండ్లుగా ఇబ్బం ది పడింది. మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరవ, చైర్పర్సన్, కౌన్సిలర్ల కృషితో ఎట్టకేలకు మరుభూమి సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయి.త్వరలో హక్కుతో అం త్యక్రియలు చేసుకునే పరిస్థితులుసాకారం కానున్నాయి.
50 ఏండ్ల కష్టం
మేడ్చల్-గండిమైసమ్మ దారిలో ఉన్న బాసరేగడి గతం లో గౌడవెల్లి గ్రామ పంచాయతీలో ఉండేది. గుండ్లపోచం పల్లి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చినప్పు డు బాసరేగడిని ఆ మున్సిపాలిటీలో విలీనం చేశారు. దాదాపు 50 ఏండ్ల కింద బాసరేగడి ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి పలువురు వచ్చి సిర్థపడ్డారు. ఆర్థికంగా ఉన్న వారు శ్మశాన వాటికకు స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ పేద దళిత వర్గానికి చెందిన వారికి మాత్రం స్థలం లేకుండా పోయింది. దీంతో వారు గ్రామానికి ఆనుకున్న ఉన్న అటవీ భూమిని వినియోగించుకున్నారు. అయితే ఆ భూమిలో అంత్యక్రియలు నిర్వహించడానికి అటవీశాఖ అధికారుల నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యేవి. భయం భయంగా మృతదేహాన్ని ఖననం చేయాల్సి వచ్చేది. కొన్ని సార్లు మృతదేహాన్ని రెండు రోజుల వరకు ఇంట్లో పెట్టుకున్న అనుభవాలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. పలుకుబడి ఉన్న వారి సహకారంతో బాధతో భయంతో అంత్యక్రియలు నిర్వహించుకునే వారు.
మంత్రి మల్లారెడ్డి చొరవ
బాసరగేడి గ్రామం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో విలీనం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎన్నో ఏండ్ల నుంచి కనీస సౌకర్యాలకు నోచుకోని బాగసరేగడి అభివృద్ధి జరిగింది. శ్మశాన వాటిక స్థలం కేటాయింపునుకు అడుగులు పడ్డాయి. మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ మారేపల్లి రాజమాకురిసుధాకర్ బాసరేగడి దళితుల పడుతున్న కష్టాన్ని మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు సమస్యను తీవ్రతను ఆయనకు వివరించడంతో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శ్మశాన వాటిక స్థల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. గతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న అటవీ స్థలంలోనే హక్కులు కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. మంత్రి చొరవ కారణంగా కొంత కాలంగా అటవీశాఖ అధికారులు కూడా అంత్యక్రియలకు అడ్డు చెప్పడం లేదు. త్వరలో అటవీ, రెవెన్యూ శాఖలు ప్రక్రియను పూర్తి చేసి, హక్కులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఆర్వోఎఫ్ఆర్ జారీ చేసేందుకు శనివారం అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించారు.
సమష్టి కృషితోనే సాధ్యమైంది..
మంత్రి మల్లారెడ్డి చొరవ, పాలకవర్గ సమష్టి కృషితో దళితుల శ్మశాన వాటిక సమస్య తీరింది. బాసగరేగడివాసులు పడుతున్న బాధను తాము మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో స్పం దించిన ఆయన అటవీశాఖ మంత్రి, అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. త్వరలో అధికారులు హక్కులు కల్పించనున్నారు. స్వేచ్ఛగా అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చు.
-మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, చైర్పర్సన్, గుండ్లపోచంపల్లి
భయ భయంగా అంత్యక్రియలు చేసేవాళ్లం..
శ్మశాన వాటిక లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. భయ భయంగా అంత్యక్రియలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఇబ్బందులు తొలగిపోయా యి. అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టడం లేదు. అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్న నాయకులకు కృతజ్ఞతలు
-మాచర్ల ఐలయ్య, బాసరేగడి
50 ఏండ్ల సమస్యకు పరిష్కారం
50 ఏండ్ల నుంచి అంత్యక్రియల నిర్వహణకు ఇబ్బంది పడ్డాం. ఎన్నోసార్లు నాయకులకు మొర పెట్టుకుని అంత్యక్రియలు నిర్వహించుకోవాల్సి వచ్చేది. రెండు రోజులు మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. శ్మశాన వాటిక స్థలం కేటాయింపు చివరి దశకు వచ్చింది. మంత్రి మల్లారెడ్డి, చైర్పర్సన్ లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సహకారంతో అటవీ శాఖ స్థల కేటాయింపు సాకారమైంది. అంత్యక్రియలకు హక్కుల కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ జారీ కానుంది. ఎండ్ల నాటి కష్టం తీర్చిన మంత్రి, మున్సిపాలిటీ పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-మారేపల్లి రాజకుమారిసుధాకర్, కౌన్సిలర్, బాసరేగడి