మారేడ్పల్లి, డిసెంబర్ 10: సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆడిటోరియంలో ‘క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో శనివారం క్రిస్మస్ ట్రీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్సీ టి. రాజేశ్వర్రావు, నామినేటేడ్ ఎమ్మెల్యే స్టిఫెన్సన్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని కుల, మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించే ందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అనంతరం యేసు క్రీస్తు జీవిత చరిత్రను నాటక రూపంలో విద్యార్థులు, విద్యార్థులు ప్రదర్శించి పలువురి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంగ్లో ఇండియన్ అధ్యక్షుడు వారెన్ లాటుచ్, ఆల్ ఇండియన్ క్రిస్టయన్ యూనియన్ అధ్యక్షుడు క్రిస్టఫర్, సెయింట్ కాలేజ్ ప్రిన్సిపాల్ అల్లం ఆరోగ్యం, క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు జాన్, రాష్ట్ర అధ్యక్షుడు మెలివిన్ బెనడిక్ తదితరులు పాల్గొన్నారు.