మంత్రి కేటీఆర్కు వినతి
సిటీబ్యూరో, జూలై13 (నమస్తే తెలంగాణ): జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
ఈ సందర్భంగా బ్యాంకులను ప్రైవేటు చేయడం ద్వారా కలిగే అనర్థాలను మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ బ్యాంకులను పనితీరును గుర్తించిందని, జాతి అభివృద్ధికి బ్యాంకులు కీలకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పార్లమెంటులో పార్టీ పరంగా ఆందోళన చేస్తామని వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు శివమోహన్, జి.వెంకన్న, మల్లికార్జున్రావు, సాంబశివరావు ఉన్నారు.