Numaish | అబిడ్స్, ఫిబ్రవరి 17 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ప్రతి యేట జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ను నిర్వహిస్తారు. ఈ సారి స్టాల్ హోల్డర్స్ విజ్ఞప్తి మేరకు నుమాయిష్ను మూడు రోజులు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి. శ్రీధర్బాబు ప్రకటించారు. దీంతో 18వ తేదీన నుమాయిష్ ముగియనుంది.
శనివారం అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నుమాయిష్కు సహకరించిన అధికారులు, స్టాల్ నిర్వాహకులు, ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి బి. హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి చంద్రజిత్ సింగ్, కోశాధికారి ఏనుగుల రాజేందర్కుమార్, వనం వీరేందర్, హరినాథ్రెడ్డి, వినయ్ ముదిరాజ్లతో పాటు వివిధ మేనేజింగ్ కమిటీల సలహాదారులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు.