ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
నేరేడ్మెట్, మార్చి 17 : మల్కాజిగిరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు అన్నారు. గురువారం నేరేడ్మెట్ డివిజన్, మధురానగర్ కాలనీవాసులు సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి కాలనీలో సమస్యలు లేకుండా ప్రణాళికలు తయారు చేయాలని, అలాగే భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, అంతర్గత రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జి బద్దం పరుశురాంరెడ్డి, రావుల అంజయ్య, పిట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్ కుమార్, గుండా నిరంజన్, ఉపేందర్రెడ్డి, చంద్రమౌలి, మహత్య వర్ధన్, దార శ్రీనివాస్రెడ్డి, చెన్నారెడ్డి, మహేశ్యాదవ్, రమేశ్, రాజు, రవీంద్ర, సావిత్రి, దేవరాజ్, నాగభూషణం, సత్యనారాయణ, మనోజ్కుమార్, భూపాల్రెడ్డి, మోతీలాల్చౌదరి పాల్గొన్నారు.