సిటీబ్యూరో, జూలై 8(నమస్తే తెలంగాణ): అఫ్జల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాయలయం ఆధునీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. భవనం లోపల ఉన్న తలుపులు, కిటికీలు, వెంటిలేటర్స్ ఏర్పాటు కోసం సుమారు రూ.27, 55327.00, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్తో పాటు ట్రెంచ్, అండర్ గ్రౌండ్ సంపు నిర్మాణం, అదే విధంగా మంచినీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల ఆధునీకరణ, 2 బోర్వెల్స్ డ్రిల్లింగ్ కోసం రూ. 34,95386.00లను వెచ్చించనట్లు తెలిపారు. ఈ పనులను వెంటనే నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు పిలిచామని, త్వరలోనే కేంద్ర గ్రంథాలయంలో ఆధునీకరణ పనులు మొదలు పెట్టి 2, 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.