మహేశ్వరం : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగు తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
శనివారం అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు గుండెమోని ప్రేమలత శ్రీరాములు ముదిరాజ్, ఇమ్మడి ఆమని అనిల్ పటేల్, బొమ్మ శ్రీనివాస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఆమె అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆమె అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుస్తున్నాయని ఆమె అన్నారు. ఇతర రాష్ట్రాలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని ఆమె అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి ఎల్లపుడు సముచిత స్థానం లభిస్తుందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, ఎంపీటీసీ కుమారి రాయప్ప, ఉప సర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు పెంటల వెంకటేష్ కోఆప్షన్ సభ్యుడు ఆవుల అశోక్ నాయకులు దేవవరం గౌడ్, వెంకటేష్, అల్వాల మచేందర్, మల్లేష్, బ్యాగరి రాజు, ఎర రవి పాల్గొన్నారు.