Lok Sabha Elections | మేడ్చల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 1500 అర్బన్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 1600 ఓటర్లు మించకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి.
ప్రసుత్తం 3199 పోలింగ్ స్టేషన్లు ఉండగా మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నాటికి అదనంగా 29 పోలింగ్ కేంద్రాలతో మొత్తం 3228 చేరుకోనున్నాయి. ఓటు హక్కు ఉన్నవారికి ఇబ్బందులు జరగకుండాఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.