బడంగ్పేట్ : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్భీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నా రు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని లెనిన్ నగర్లో మంగళవారం సాయంత్రం రాచకొండ సీపీ ఆదేశాల మేరకు 298 మంది పోలీసులతో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మట్లాడుతూ వినాయక ఉత్స వాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కార్డన్ సర్చ్ నిర్వహించామన్నారు.
ఈ సందర్భంగా రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆటోమొబైల్ దొంగతనాలు, సెల్పోన్ దొంగతనాలు, సాధారణ దొంగతనాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. అలాగే సరైన కాగితాలు,నెంబర్ ప్లేట్స్ లేని 78 మోటర్ సైకిల్స్ , 6 ఆటోలు సీజ్ చేయడం జరిగిందన్నారు. బెల్టు షాపులలో మద్యం విక్రయిస్తున్న వారి నుంచి 58 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పలువురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు.
సంఘ విద్రోహక శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలనీలలో కొత్త వారు ఎవరైనా కన్పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.