బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్పొరేటర్ల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్ తదితరులు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
బాధ్యతాయుతమైన కార్పొరేటర్ పదవిలో ఉండి మేయర్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం తీవ్ర అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన కార్పొరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో వారు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.