CV Anand | బంజారాహిల్స్, ఏప్రిల్ 12 : మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదని, ఆయా క్రీడాకారులు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ అన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఏఫ్ఎన్సీసీ ఓపెన్ టెన్నీస్ పురుషుల విభాగం టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమానికి ఆయన టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జాతో కలిసి హాజరై మాట్లాడారు.
ఐపీఎల్ తరహాలో ఇతర క్రీడలకు కూడా స్పాన్సర్ల మద్దతు దొరికితే అనేక మంది అద్భుత క్రీడాకారులు వెలుగులోకి వస్తారని సీవీ ఆనంద్ అన్నారు. సానియా మీర్జా మాట్లాడుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు డబ్బులు లేక చాలామంది క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరినాథ్, కార్యదర్శి ముళ్లపూడి మోహన్ తదితరులు పాల్గొన్నారు.