హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ ట్రాన్స్కో లైన్ఇన్స్పెక్టర్, లైన్మెన్ లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కారు. మాదాపూర్కు చెందిన ఎస్పీ నాగజ్యోతి కరెంట్ మీటర్ కోసం లైన్మెన్ను సంప్రదించారు. అయితే రూ.10 వేలు ఇస్తేనే మీటర్ ఇస్తామని లైన్ఇన్స్పెక్టర్ ప్రభాకర్, లైన్మెన్ ఆమెకు చెప్పారు. దీంతో ఆమె అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా లైన్ఇన్స్పెక్టర్, లైన్మెన్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.