అక్టోబర్ 31: ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిపోవడంతో ధరలను అదుపు చేసేందుకు నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 25 రూపాయలకు కిలో ఉల్లి పాయల విక్రయాన్ని ప్రారంభించారు.
నగరంలోని పలు ప్రాంతాలలో ఈ సబ్సిడీ ధరలకు ఉల్లిపాయల విక్రయాలను చేపట్టారు. ధరలు అదుపులోకి వచ్చేంత వరకు విక్రయాలను కొనసాగిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.