కవాడిగూడ, డిసెంబర్ 19: లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ, సీబీఐ జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆప్ నేతలు ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ఢిల్లీ సీఎంకు జారీ చేసిన ఈడీ సమన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాముగౌడ్, మహ్మద్ మాజీద్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు హేమ జిల్లోజు, మహిళా నేతలు మౌనిక, మంజుల, అధికారం ప్రతినిధి విజయ్ పవర్, టి. రాకేష్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి, కొడంగల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.