Hyderabad | హైదరాబాద్ : మటన్ కోసం జరిగిన గొడవ.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని గోల్బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత మటన్ తినే విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉండటంతో ఆ గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన చారి కత్తితో అజయ్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో అజయ్కు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చారిను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.