Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లోని మధురానగర్లో విషాదం నెలకొంది. రహమత్నగర్లోని ఓ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. గాలి పటాలు ఎగురవేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. మృతుడిని చౌహాన్ శ్రీదేవ్(21)గా పోలీసులు గుర్తించారు. అయితే స్నేహితులతో కలిసి మద్యం మత్తులో గాలిపటాలు ఎగురవేసినట్లు తెలుస్తోంది. చౌహాన్ ఆరుగురు స్నేహితులపై మధురానగర్ పోలీసు స్టేషన్లో మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.