హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్(OU police station) వద్ద రాత్రి ఓ కారు అదుపు తప్పి బోల్తా (Caroverturned) పడింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్షతిరాజ్(24) అనే యువకుడు మృతి(Young man died) చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతిరాజ్ వరంగల్ నిట్లో చదువుతున్నాడు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు. అద్దె కారులో మిత్రులతో కలిసి తిరిగి వెళ్తుండగా ఓయూ పీఎస్ వద్ద కారు అదుపు తప్పి బోల్తాపడటంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.