హైదరాబాద్ : హాస్పిటల్ బిల్డింగ్(Hospital building) పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు (Committed suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఎల్బీ నగర్లో(LB Nagar) మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రితీష్ రెడ్డి అనే యువకుడు ఎన్టీఆర్ నగర్లోని ఓ హాస్పిటల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అయితే గతంలో జరిగిన రోడ్డు ప్రమాద కేసుకు భయపడే రితీష్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.