TSRTC | హైదరాబాద్ : మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది. సామర్థ్యానికి మించి బస్సుల్లో ఎక్కుతున్నారు. అంతేకాకుండా మేడారం జాతరకు సిటీ బస్సులన్నింటినీ పంపించడంతో.. బస్సులు తక్కువయ్యాయి. దీంతో ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణం ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
సికింద్రాబాద్ పరిధి లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో మహిళా ప్రయాణికులు ఫుడ్ బోర్డింగ్ చేసేందుకు యత్నించారు. ఓ మహిళ ఎక్కుతుండగా బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆమె పట్టు కోల్పోయి కింద పడిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.