హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ బాక్సు తెరిచి చేతులు పెట్టాడు. దాంతో ఆ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై విలవిలలాడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తమై.. అతన్ని పక్కకు లాగేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తికి కానిస్టేబుల్ బోలా శంకర్ సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణా హోటల్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.
సీపీఆర్ నిర్వహించడంతో ఆ వ్యక్తి స్పృహ లోకి వచ్చాడు. అనంతరం ఆ వ్యక్తిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ ద్వారా బాధిత వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శంకర్పై బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహరాజుతో పాటు అధికారులు ప్రశంసల వర్షం కురిపించి, అభినందించారు.