Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె పార్థివదేహానికి మారేడ్పల్లి హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు కార్ఖానాలోని నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగింది. అంతకుముందు లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.