మైలార్దేవ్పల్లి, జనవరి 31: అత్తాపూర్ హుడా కాలనీలో శనివారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. బాలిక కాలికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కను తరిమికొట్టారు. వెంటనే ప్రథమ చికిత్స కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడదపై అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.