వెంగళరావునగర్, సెప్టెంబర్ 21: కూల్ డ్రింక్ అనుకొని యాసిడ్ తాగి చిరు వ్యాపారి మృతి చెందిన ఘటన రహ్మత్నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన సుశాంత్కుమార్ సాహు (43) తమ కుటుంబంతో కలిసి రహ్మత్నగర్లో నివాసం ఉంటున్నాడు. రహ్మత్నగర్ చౌరస్తాలో సాహు టీ స్టాల్ను నిర్వహిస్తుండగా..అతడి భార్య సుమిత్ర టీచర్గా పనిచేస్తుంటారు. బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ను కొనుగోలు చేసిన సుమిత్ర.. ఖాళీ కూల్ డ్రింక్ బాటిళ్లల్లో నింపి వంటగదిలో దాచారు.
ఈనెల 19న సాయంత్రం సాహు తన కుమార్తెను స్కూల్ నుంచి ఇంటికి తెచ్చాడు. ఇంట్లో భోజనం చేశాక కూల్ డ్రింక్ తాగేందుకు కిచెన్ రూమ్లోకి వెళ్లాడు. కూల్ డ్రింక్ అనుకొని యాసిడ్ బాటిల్ను తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు సాహుకు వైద్యం కోసం అమీర్పేట లోని ప్రైవేట్ దవాఖనాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.