Hyderabad | హైదరాబాద్ : బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫహద్ ప్రేమించాడు. ఆమె మతం మార్చి 2016లో పెళ్లి చేసుకున్నాడు ఫహద్. పెళ్లి చేసుకున్న కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. ఇద్దరూ హైదరాబాద్లోనూ ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్గా పాకిస్థాన్ యువకుడు ఫహద్ భార్యకు పట్టుబడ్డాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఫహద్తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఫహద్ 1998లో పాకిస్థాన్ నుండి భారత్ వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫహద్ పూర్వ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.