హైదరాబాద్ : నగరంలోని మారేడుపల్లిలో( Maredupally) ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అర్ధరాత్రి మద్యం దుకాణం ముందు ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. ఈ గొడవలో సందీప్ అనే వ్యక్తి ఇమ్రాన్ను బ్లేడ్తో గొంతు కోసి చంపాడు.
సంఘటన స్థలంలోనే ఇమ్రాన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘర్షణలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో సైతం విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.