హైదరాబాద్ : రోడ్డు ప్రమాదం(Road accident)లో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal PS) పరిధి డి.పోచంపల్లి పెట్రోల్ పంప్ దగ్గర ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్(Bike)పై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ(ణorry) వేగంగా వచ్చి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. కాగా, మృతడు అత్తాపూర్ వాసిగా గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.