హైదరాబాద్ : బాలిక అపహరణ కేసులో ఓ నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది. 2015లో సరూర్నగర్లో ఓ 13 ఏండ్ల బాలికను శ్రవణ్ అపహరించాడు. బాలిక పాఠశాలకు వెళ్తుండగా శ్రవణ్ కారులో వచ్చి ఆమెను ఎత్తుకెళ్లాడు. అనంతరం బాలికను బలవంతంగా పెళ్లి చేసుకోబోయాడు.
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సరూర్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సరూర్ నగర్ పోలీసులు కోర్టుకు సాక్ష్యాలు సమర్పించారు. దీంతో నిందితుడు శ్రవణ్కు కోర్టు నాలుగేండ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది.