హైదరాబాద్ : బాచుపల్లిలో విషాదం నెలకొంది. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్ బిల్డింగ్ 13వ ఫ్లోర్ నుంచి విద్యార్థి దూకి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి శివనాగులు అని పోలీసులు పేర్కొన్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.