ఉస్మానియా యూనివర్సిటీ : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మెన్ మర్రి శశిధర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హిమంత చేసిన వ్యాఖ్యలు సోనియాగాంధీ వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. దానిని మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చేవిధంగా భావించి, ఆయనపై ఐపీసీ 294బీ, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలన్నారు.
ఫిర్యాదు కాపీలను పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీలకు సైతం పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎమ్మార్ శ్రీనివాస్, వసంత యాదవ్, నాయకులు బాలకృష్ణ, దయానందరావు, నర్సింగ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.