మూసాపేట, మార్చి19 : ముందు వెళ్తున వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ కంటైనర్(Container) అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మూసాపేట నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న (AP 23Y 4233) కంటైనర్ మూసాపేట(Musapet) మెట్రో స్టేషన్ వద్ద ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది.
ఆ సమయంలో అక్కడ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కంటైనర్ను వదిలి పరారయ్యాడు. వాహనాదారుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కంటైనర్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు.