మారేడ్పల్లి, ఫిబ్రవరి 24 : జిమ్లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ నేతాజీ కథనం ప్రకారం… ఆదయ్యనగర్, న్యూ గ్యాస్మండి సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యాంజల విశాల్(30) ఆసిఫ్నగర్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. ఈ నెల 23న రాత్రి 7 గంటలకు మారేడ్పల్లిలోని ఓ జిమ్కు వెళ్లి వ్యాయమం చేస్తుండగా విశాల్కు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు.
జిమ్ నిర్వాహకులు వెంటనే విశాల్ను సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్.జి శివమారుతి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది విశాల్ మృతికి నివాళులర్పించారు.