హైదరాబాద్ : ప్రజాపాలన(Prajapalana) లబ్ధిదారుల ఎంపికపై స్పష్టమైన ప్రకటన చేయాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్లో పర్యటించారు.
నల్లగుట్టలోని వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజాపాలన దరఖాస్తుదారులలో అర్హుల ఎంపిక విషయంలో స్పష్టత లేక అయోమయానికి గురవుతున్నారని, ఎంపిక ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. దరఖాస్తులో బ్యాంకు ఖాతా వివరాలు పేర్కొనలేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.