హైదరాబాద్ : డిజైన్లు నచ్చాయంటూ నగలు(jeweler) తీసుకొని మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని టిబెరుమాళ్ జ్యువెలర్స్ షాప్(Tiberumal Jewellers)లో బెంగళూరుకు చెందిన వ్యక్తులు షాపింగ్ చేశారు. నగలు నచ్చాయని మరోసారి పరిశీలించి ఇస్తామని రూ. 85లక్షల విలువైన ఆభరణాలను తమ వెంట తీసుకెళ్లారు. తిరిగి ఇవ్వకపోవడంతో టిబెరుమాళ్ జ్యువెలర్స్ సంస్థ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నగలు తీసుకెళ్లిన వారు సంస్థకు తెలిసిన వారే కావడంతో ఇచ్చామని బాధితులు తెలిపారు.