Hyderabad | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం వెనుకాల ఉన్న మింట్ కంపౌండ్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ పార్కు చేసిన కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్పటికే కారులో ఉన్న డ్రైవర్.. మంటలను గమనించి క్షణాల్లో కిందకు దిగేశాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.