Group-4 Exam | గ్రూప్-4 పరీక్షకు ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చి పట్టుబడ్డాడు. హైదరాబాద్ సరూర్ నగర్లోని మారుతీనగర్ సక్సెస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రానికి ఓ అభ్యర్థి సెల్ఫోన్తో వచ్చాడు. అయితే పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి సదరు అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. ఫోన్ చేసి సదరు అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకోవడం వల్ల చౌటుప్పల్లో ఓ అభ్యర్థి పరీక్ష రాయలేకపోయారు. ఓ అభ్యర్థి పరీక్ష రాసేందుకు సెంటర్కు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్లాడు. అయితే అది వేరే అడ్రస్ను చూపించడంతో పొరపాటు గమనించి ఎగ్జామ్ సెంటర్కు వెళ్లేసరికి 30 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు.