కుత్బుల్లాపూర్, డిసెంబర్ 30 : ప్రైవేటు రంగ సంస్థల నుంచి వస్తున్న సీఎస్ఆర్ నిధులతో పేదలకు మేలు కలిగేలా సామాజికాభివృద్ధి పనులకు పెద్దపీట వేయడం హర్షణీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయనగర్లో ప్రభుత్వ పాఠశాలలో 8 అదనపు గదుల నిర్మాణానికి దుండిగల్ గ్లాండ్ ఫార్మా సౌజన్యంతో రూ.2 కోట్ల వ్యయాన్ని వెచ్చించారు. ఈ పనులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, స్థానిక మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్తో పాటు సంస్థ ప్రతినిధులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవలో ప్రైవేట్ రంగాల సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేశ్, పార్టీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి. శ్రీనివాస్, సత్తిరెడ్డి, నాయకులు కిశోర్చారి, యాదగిరి, బాలయ్య, పెంటయ్య, మధుకర్, వెంకటేశ్, అజయ్, రాముడు కాలనీ అసోషియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
126 డివిజన్ పరిధికి చెందిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు. ఐడీఐ జీడిమెట్ల ఫేస్-4 వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సహకారంతో మినీలారీలకు, ఆటో, ట్రాలీ వాహనాలకు పార్కింగ్ స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయా యూనియన్ల ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గాజులరామారం : ప్రతి బస్తీ, కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని పోచమ్మ బస్తీలో సుమారు రూ.39 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం బస్తీ వాసులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన బస్తీ సంక్షేమ సంఘం సభ్యులను ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
డీఈఈ రూపాదేవి, సీనియర్ నాయకులు మీర్జా రశీద్ బేగ్, కస్తూరి బాల్రాజు, ఆబిద్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్యాదవ్, సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, ఉపాధ్యక్షులు రఘునాథ్, వినోద, రమేశ్, ఆంజనేయులు, జనరల్ సెక్రటరీ నవీన్, జాయింట్ సెక్రటరీలు అశోక్, సాయిప్రకాశ్, శ్రీకాంత్, క్యాషియర్ ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ శేఖర్, సయ్యద్ ఫెరోజ్, మునీర్, కార్యవర్గ సభ్యులు జనార్దన్, సుజాత, రాజు, రవి, హేమ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.