Hyderabad | హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పరిధిలో మూడు రోజుల క్రితం ఓ యాచకుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును మోండా మార్కెట్ పోలీసులు ఛేదించారు. యాచకుడిని హత్య చేసిన మహ్మద్ మోసిన్ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 800 కోసం నితిలేశ్పై మోసిన్ఖాన్ బ్లేడుతో దాడి చేశాడు. ఈ దాడిలో నితిలేశ్ ప్రాణాలు కోల్పోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిజామాబాద్లో నిందితుడు మోసిన్ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.