దుండిగల్, ఏప్రిల్ 7 : ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల సెక్రెటరీ మర్రి రాజశేఖర్రెడ్డి, వెటరన్ అథ్లెట్, ఎంఎల్ఆర్ విద్యా సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్రెడ్డి అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల ఎన్ఎస్ఎస్(నేషనల్ సర్వీస్ స్కీం) విభాగం, మర్రి అరుంధతి వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘5 కే రన్’ నిర్వహించారు. ఈ పోటీలను మర్రి లక్ష్మణ్ రెడ్డితోపాటు జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా.ఎల్.సైదా నాయక్ ప్రారంభించారు. ఇందులో నగర శివారు ప్రాంతాల్లోని 20 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులతోపాటు 35 ఏండ్లు పైబడిన యువతీ యువకులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. నడక మనిషి ఆరోగ్యానికి మంచి ఔషధంగా పని చేస్తుందని, ప్రతిఒక్కరూ ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఎంఎల్ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.శ్రీనివాస్రావు, డీన్ డా.రాధికాదేవి, అరుంధతి వైద్యశాల డీన్ డా.ఉదయ్కుమార్, డైరెక్టర్ డా.బాలాజీ, మారధాన్ రన్నర్ హరిహరన్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ఉదయ్రంజన్, వివిధ విభాగాల అధిపతులు డా.ఎం.సత్యనారాయణగుప్త, డా.ఎంవీ.నర్సింహారావు, డా.అచ్చిరెడ్డి, డా.సుభాషిణి, డా.రాజగోపాల్రెడ్డి, కే.సాయిప్రసాద్ తదితరులతో అధ్యాపకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.