సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా 74 మున్సిపల్ కమిషనర్లను సర్కారు బదిలీ చేసింది. అందులో భాగంగా ఎనిమిది మందిని బల్దియాకు కేటాయించారు.
వీరిలో అధికారులు ఎ. శైలజ, ఎ. సుజాత, సీహెచ్ నాగేశ్వర రావు, డి. సుభాశ్రావు, జి. వేణుగోపాల్ రెడ్డి, మహ్మద్ షేక్, ఎస్. విద్యాధర్, వి. సమ్మయ్య ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు సొంత జిల్లాలు, మూడేండ్ల కంటే ఎక్కువ రోజులు అదే స్థానంలో ఉన్న అధికారులను బదిలీ చేస్తున్నారు.