హైదరాబాద్: దుండిగల్ (Dundigal) పరిధిలోని బౌరంపేటలో (Bowrampet) విషాదం చోటుచేసుకున్నది. అమ్మమ్మ తాత వద్దకు వచ్చిన బాలుడు నిర్మాణంలో ఉన్న భవనం ముందున్న గేటు మీదపటడంతో మృతిచెందాడు. మెదక్ జిల్లా కుకునూరు మండలం వెల్దుర్తికి చెందిన ఆకాశ్ అనే ఏడేండ్ల బాలుడు.. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్న అమ్మమ్మ, తాతల వద్దకు బుధవారం వచ్చాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం గేటు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అది బాలుడిపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆకాశ్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.