మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 8: రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాంపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మీసాల మల్లేశ్, మాజీ వార్డు సభ్యులు కొండేటి లత నర్సింహరెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, బందెల పరమేశ్, మీసాల మల్లేశ్, మంచాల నర్సింగ్రావు, కొండేటి రాంరెడ్డి, లక్ష్మణ్రెడ్డి, శ్రీనివాస్, బాలయ్య లతో పాటు 600 మంది బీఆర్ఎస్లో చేరగా, మల్లారెడ్డి వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాంపల్లిలోని పలు కాలనీలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించగా మహిళలు, నాయకులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించకున్న పాపాన పోలేదని, ఇంత వరకు ఒక్క అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు ఎక్కడ లేవని విమర్శించారు. పేదల కాలనీలో 58 జీఓ కింద ఇంటి పట్టాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. కాగా, నాగారం 20వ వార్డులోని మేదరి సంఘం సభ్యులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేదరి సంఘం పూర్తిగా బీఆర్ఎస్కే ఓటు వేస్తామని మంత్రి సమక్షంలో తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, రాష్ట్ర నాయకులు చామకూర బద్రారెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.