బడంగ్పేట,అక్టోబర్27 : ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలోని నాలుగు జూనియర్ కళాశాలలకు రూ.6.55 కోట్లు కేటాయించామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. తరగతి గదులు, కంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. మీర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలలో తరగతి గదుల నిర్మాణం కోసం రూ.1.35కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
కందుకూరులో 8 తరగతి గదులు, కంపౌండ్ వాల్స్, మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు, మహేశ్వరంలోని జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, మరుగు దొడ్ల నిర్మాణాకి రూ.1.20కోట్లు, సరూర్నగర్ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, మరుగు దొడ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించామని వివరాలను వెల్లడించారు. దశల వారీగా నియోజక వర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.