బంజారాహిల్స్,ఫిబ్రవరి 8: వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణంతో పాటు జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ రూ.6.36 కోట్లు మంజూరు చేశారని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ను కలిసిన కార్పొరేటర్ కవితారెడ్డి డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. ఇటీవల డివిజన్ పరిధిలో చాలా ప్రాంతా ల్లో సీవరేజ్లైన్ పనులు పూర్తయ్యాయని, ఆయా ప్రాంతా ల్లో సీసీ , వీడీసీసీ రోడ్లు వేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ డివిజన్ పరిధిలో రోడ్ల నిర్మాణం కోసం రూ.5.10కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో దేవరకొండబస్తీ, ఆరోరాకాలనీ, వెంకటేశ్వరనగర్, ఓల్డ్ వెంకటేశ్వరనగర్, యూబీఐ కాలనీ, శ్రీనికేతన్ కాలనీ, గౌరీశంకర్ కాలనీ, జర్నలిస్టు కాలనీ, సింగాడబస్తీ తదితర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని కార్పొరేటర్ తెలిపారు. దీంతో పాటు శ్రీనగర్కాలనీ, సింగాడబస్తీ, షౌకత్నగర్, ప్రతాప్నగర్ తదితర ప్రాంతాల్లో సీవరేజ్లైన్లు, మంచినీటి లైన్ల కోసం మంత్రి కేటీఆర్ రూ.1.26 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.