హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ నిబంధనలు అత్రిక్రమించేవారి సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నది. పోలీసులు ఎన్ని కేసులు నమోదుచేసినా, ఎంతగా జరిమానాలు విధిస్తున్నా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను పట్టించుకోవడం లేదు. ఇందులో ముఖ్యంగా బైకులు నడిపేవారే అత్యధికంగా ఉంటున్నారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో బైక్ రైడర్లపై గతేడాది 70,03,012 కేసులు నమోదయ్యాయి. ఇందులో హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపినవే 53 లక్షలకుపైగా కేసులు ఉండటం గమనార్హం.
కాగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 15.33 లక్షల కేసులు నమోదయ్యాయి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల గతేడాది 356 మంది ద్విచక్ర వాహనదారులు మరణించారని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి బైక్ నడిపిన వారిపై 25,453 కేసులు నమోదుచేశారు.
అదేవిధంగా నగరంలో సర్వసాధారణంగా మారిన మరో ట్రాఫిక్ ఉల్లంఘన రాంగ్ సైడ్ డ్రైవింగ్. మూడు కమిషనరేట్ల పరిధిలో హెల్మెట్ సంబంధిత కేసుల తర్వత ఇవే అత్యధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, స్పీడ్ డ్రైవింగ్ వంటి అంశాలపై పోలీసులు దృష్టిసారించారు.
హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ద్విచక్ర వాహనదారులపై గతేడాది 70 లక్షల కేసులు నమోదయ్యాయి. 2020లో ఈ సంఖ్య 58.58 లక్షలుగా ఉన్నది.