శామీర్పేట/ మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 1: కాంగ్రెస్, బీజేపీకు గడ్డుకాలం వచ్చిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామ బీజేపీ అధ్యక్షుడు అన్నబోయిన అశోక్, నాయకులు తాటికొండ మహేశ్, అన్నబోయిన రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్ళ మహేశ్గౌడ్, గుండ్లపల్లి వెంకటేశ్గౌడ్, ఉడుతల ఆంజనేయులు, చెక్కల భాగయ్య, అన్నబోయిన భాస్కర్, వడ్డరి కృష్ణ, కొండ రాములు, బండి మల్లేశ్తో పాటు మరో వందమంది ఆదివారం బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి మల్లారెడ్డి పార్టీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా నాగారం మున్సిపాలిటీ రాంపల్లి 4వ వార్డులోని శేషాద్రినగర్, శ్రీ గణేశ్ నగర్, సావిత్రినగర్, సూర్యనగర్, సంతోష్నగర్ తదితర కాలనీలకు చెందిన సుమారు 400 మంది వివిధ పార్టీల నేతలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గడ్డుకాలం వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వంటెద్దు పోకడలు నచ్చకనే ఆయా పార్టీలను వీడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, సొసైటీ డైరెక్టర్ భిక్షపతి, ఉపసర్పంచ్ అంజిరెడ్డి, వార్డు సభ్యులు సత్యనారాయణ, భూపాల్రెడ్డి, సుధాకర్, మురళి, సీనియర్ నాయకులు దత్తుగౌడ్, అమిరిశెట్టి శ్రీనివాస్, శ్రీధర్రెడ్డి, శేఖర్ముదిరాజ్, అన్నబోయిన రాజు, ఆంజనేయులు, స్వామి, అబ్దుల్, రమేశ్, వెంకటేశ్గౌడ్, సాయిగౌడ్, శ్రీనివాస్గౌడ్, మహేశ్గౌడ్, శ్రీధర్,కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.